వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్‌ విడుదలకు 30 కోట్లు: జయ

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: అడవిదొంగవీరప్పన్‌ మాజీ మంత్రి నాగప్పను కిడ్నాప్‌ చేసినవిషయమై తమిళనాడు ముఖ్యమంత్రి జె. జయలలిత కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. కృష్ణపై తీవ్రంగా ధ్వజమెత్తారు. నాగప్ప విడుదలకువీరప్పన్‌తో సంప్రదింపులు జరిపే విషయాన్ని ఆమె సోమవారంవిలేకరుల సమావేశంలో త్రోసిపుచ్చారు.

రెండేళ్ల క్రితం ప్రముఖ సినీనటుడు రాజ్‌కుమార్‌ను విడిపించడానికి కర్ణాటకవీరప్పన్‌కు 30 కోట్ల రూపాయలు చెల్లించిందని ఆమె ఆరోపించారు. నాగప్ప ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండావీరప్పన్‌ను పట్టుకోవాలనేదే తమ లక్ష్యమని ఆమె చెప్పారు. తమిళనాడు, కర్ణాటకలస్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ వీరప్పను పట్టుకోవడానికి కృషి చేస్తోందని ఆమె అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న గాలింపు చర్యలపై కర్ణాటక, తమిళనాడులు పరస్పరం సంప్రదించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. నాగప్ప భార్య పరిమళ మంగళవారం తనను కలుస్తున్నట్లు ఆమె చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X