వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీరప్పన్‌ కు పైసా ఇవ్వలేదుః కృష్ణ

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరుః కన్నడ కంఠీరవుడు రాజ్‌ కుమార్‌ విడుదల కోసం కర్నాటక ప్రభుత్వంవీరప్పన్‌ కు 30 కోట్ల రూపాయలు ముట్టచెప్పిందంటూ జయలలిత చేసిన ఆరోపణలను కర్నాటక ప్రభుత్వం ఖండించింది. 2000 నవంబర్‌ లో గంధపు చెక్కల స్మగ్లర్‌వీరప్పన్‌ కన్నడ కంఠీరవుడు రాజ్‌ కుమార్‌ ను కిడ్నాప్‌ చేసి నూటపది రోజులు బందీగా వుంచుకున్నాడు. రాజ్‌ కుమార్‌ ని విడిపించుకొని పరువు నిలుపుకొనేందుకుఅప్పటి కర్నాటక ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు చెల్లించిందని జయలలిత సోమవారం ఆరోపించారు.

ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారం అని కర్నాటక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న జయలలిత ఇటువంటిఅర్థంపర్థంలేని ఆరోపణలు చేయడం విచారకరం అని కర్నాటక ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. కృష్ణ వ్యాఖ్యానించారు. రాజ్‌ కుమార్‌ విడుదల కోసంవీరప్పన్‌ కు నయాపైసా కూడా ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.వీరప్పన్‌ ఇటీవల కిడ్నాప్‌ చేసిన జనతాదళ్‌ కు చెందిన మాజీ మంత్రి నాగప్ప విడుదల గురించివిలేకర్లు ప్రస్తావించగా, వీరప్పన్‌ నుంచి నాకు ఎటువంటి సమాచారం రాలేదు.. ఏ చిన్న సమాచారం వచ్చినా దానిని వెల్లడిస్తానని కృష్ణ చెప్పారు. కొల్లేగల్‌ లో వున్న డిజిపి భాస్కర్‌ తో నిరంతరం మాట్లాడుతున్నట్లు కృష్ణ వెల్లడించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X