వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సారీ చెప్పకపోతే జయకు శాస్తి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ భారత పౌరురాలే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా జయలలిత ఆరోపణలు చేయడం అర్థంలేని రాష్ట్ర కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. జయలలిత క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆంధ్రప్రదేశ్‌ మహిళా కాంగ్రెస్‌ హెచ్చరించింది. బిజెపి కటాక్షం కోసమే జయలలిత ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని, దేశప్రజల దృష్టిమళ్ళించేందుకే బిజెపి జయలలిత కోసం ఇటుంవంటి ఆరోపణలు చేయిస్తున్నారని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యురాలు సరోజినీ పుల్లారెడ్డి విమర్శించారు.

దేశ కోసం భర్త రాజీవ్‌ గాంధీని కోల్పోయిన సోనియాగాంధీనివిమర్శించే హక్కు జయలలితకు లేదని ఆమె దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ సాధిస్తున్న అభివృద్ధిని చూసిఓర్వలేకనే జయలలిత ఇలా ఆరోపణలు చేస్తున్నారని, తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పకపోతే జయను వదిలేది లేదని ఆమె హెచ్చరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X