వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టేషనరీ స్కాంలో మంత్రికి క్లీన్‌ చిట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలుః మూడు జిల్లాల పంచాయతీ రాజ్‌ శాఖల్లో రెండు కోట్ల రూపాయల వరకుస్వాహా చేసిన కేసులో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన అల్లుడికి అధికారులు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. అవసరానికి మించి స్టేషనరీని కొనుగోలు చేసి, కోట్లాది రూపాయలు స్వాహా చేసిన వ్యవహారానికి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన అల్లుడే బాధ్యుడని కాంగ్రెస్‌, వామపక్షాలు ఆరోపించాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన ఆ శాఖ అధికారులు మంత్రికి కానీ, ఆయన అల్లుడికి కానీ ఈ స్కాంతో సంబంధం లేదని, శాఖ అధికారులే అవినీతికి పాల్పడ్డారని నిర్ధారించారు.

మంత్రిని, ఆయన అల్లుడ్ని కాపాడేందుకు అధికారులను బలపశువులనుచేస్తున్నారని కాంగ్రెస్‌, వామపక్షాలు ధ్వజమెత్తాయి. ఈ వ్యవహారంపైస్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కాంగ్రెస్‌, వామపక్షాలు హెచ్చరించాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X