వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోస్తాకు విస్తరించినపీపుల్స్‌ వార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఇంతకాలం తెలంగాణా జిల్లాలకు పరిమితమైనపీపుల్స్‌ వార్‌ కోస్తా జిల్లాలకు విస్తరించిందని రాష్ట్ర డిజిపిపేర్వారం రాములు అన్నారు. రాష్ట్రపోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇటీవల చింతపల్లి పోలీస్టేషన్లపై జరిగిన మెరుపుదాడి, గుంటూరు జిల్లాలో నక్సలైట్లు కార్యకలాపాలు పెరగడం ఇందుకు ఉదాహరణ అని ఆయన చెప్పారు. పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం వున్నదని ఆయన చెప్పారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి దేవేందర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల ప్రవర్తన మారాలని, లాకప్‌ డెత్‌ లవిషయంలో పోలీసులను ఉపేక్షించే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. దేవేందర్‌ గౌడ్‌ మాట్లాడుతూ పోలీసుల పనితీరు పారదర్శకంగా వుండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. అవసరమైతే రాత్రి పూట కూడా నిందితులను న్యాయమూర్తుల ఎదుట హాజరుపరచడం ద్వారా పోలీసు శాఖను పారదర్శకంగా మార్చేందుకు ప్రయత్నస్తున్నామన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X