వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విషజ్వరాలతోవణుకుతున్న ఆంధ్ర
హైదరాబాద్ః ఆంధ్రరాష్ట్రాన్నివిషజ్వరాలు, డెంగ్యూ వ్యాధి వణికిస్తున్నది.వరంగల్ లో డెంగ్యూ వ్యాధి ఒకరిని పొట్టన పెట్టుకుంది.మరో 20 మంది అనారోగ్యం పాలయ్యారు. ఈ వ్యాధిఇంత వరకు వరంగల్ జిల్లా వీరన్నపేటకుపరిమితం కాగా ఇప్పుడు మరో ఆరు గ్రామాలకు విస్తరించింది.మొదట ఉదాసీనత ప్రదర్శించిన వైద్యఅధికారులు ఇప్పుడు హుటాహుటిన చర్యలుచేపడుతున్నారు.
విశాఖ జిల్లా జి.మాడుగులమండలంలో అతిసార వ్యాధి ఇంతవరకు 20 మందినిపొట్టన పెట్టుకుంది. అతిసారతో కనీసం ఐదారుగ్రామాలు గడగడ వణికి పోతున్నాయి.అతిసారంతో విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు వణికిపోతున్నాయి.నిన్నటి వరకు అవన్నీ సహజమరణాలేఅని బుకాయించిన వైద్య అధికారులు క్రమంగాఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి, సహాయ చర్యలు ప్రారంభంచారు.
Comments
Story first published: Monday, September 16, 2002, 23:53 [IST]