వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్రవాదంపై భారత్‌ కు బుష్‌ బాసట

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌ః తీవ్రవాద నిర్మూలనలోభారత్‌ కు అమెరికా పూర్తి మద్దతుప్రకటించిందిందని భారత ప్రధాని అటల్‌బిహారి వాజ్‌ పేయి వెల్లడించారు. అయితేకాశ్మీర్‌ లో కాని దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోకానీ మా సొంతబలంతోనే తీవ్రవాద నిర్మూలనచేస్తామన ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.అమెరికా అధ్యక్షుడు బుష్‌ తో జరిపినసమావేశం సందర్భంగా తీవ్రవాద నిర్మూలనలోభారత్‌ కు బాసటగా నిలుస్తామని ఆయన హామీఇచ్చారని వాజ్‌ పేయి తెలిపారు. అమెరికాలో ఐదురోజులపర్యటన ముగింపు సందర్భంగా వాజ్‌ పేయి న్యూయార్క్‌లో విలేకర్లతో మాట్లాడారు.

వాస్తవాధీనరేఖనుఅంతర్జాతీయ సరిహద్దుగా మార్చే ప్రసక్తిలేదని వాజ్‌ పేయి విలేకర్ల ప్రశ్నకుసమాధానంగా చెప్పారు. వాస్తవాధీన రేఖ అంశంపైచర్చలకు కూడా భారత్‌ సిద్ధంగా లేదని ఆయనచెప్పారు. పాక్‌ కేంద్ర బిందువుగా భారత్‌ - అమెరికాసంబంధాలు వుండాల్సిన అవసరం లేదని బుష్‌తో చెప్పినట్లు వాజ్‌ పేయి వివరించారు.తీవ్రవాదంపై నిరంతర పోరాటం జరగాల్సినఅవసరాన్ని బుష్‌ కు వివరించామని వాజ్‌ పేయి వివరించారు.

భారత్‌ - పాక్‌ మధ్య ఉద్రిక్తతలనివారణకు, కాశ్మీర్‌ లో ఎన్నికలు సజావుగా సాగేందుకుసహకరిస్తామని బుష్‌ చెప్పారన్నారు.భారత్‌ - పాక్‌ మధ్య నేను లేకున్నా మీరుతప్పని సరిగా వుంటరని బుష్‌ తోచెప్పినట్లు వాజ్‌ పేయి అనగానే విలేకర్లసమావేశంలో నవ్వులు పండాయి. ఐదురోజులఅమెరికా పర్యటన ముగించుకున్న వాజ్‌ పేయిమంగళవారం సాయంత్రానికి భారత్‌చేరుకుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X