ఉచిత విద్యుత్పై కాంగ్రెస్, టీడీపీల వార్!
హైదరాబాద్: ఎప్పుడు అధికారంలోకి వచ్చినా..రైతలుకు ఉచితవిద్యుత్ అందిస్తామంటూ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి సోమవారం ప్రచారంయాత్రలు ప్రారంభించడంతో టీడీపీ, కాంగ్రెస్ ల మధ్యవిమర్శల యుద్దం మొదలైంది. ఉచిత్ విద్యుత్విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కర్నూల్ లో మరోసారి స్పష్టం చేశారు. కర్నూలులో యాత్ర మొదలైన వెనువెంటనే హైదరాబాద్ లో టీడీపీ రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యలపైవిమర్శలు సంధించింది.
వై.ఎస్. ప్రజాకర్షిక మాటలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఛీఫ్ ట్రిక్ ప్రయోగిస్తున్నారని టీడీపీ ప్రతినిధులు హైదరాబాద్ లో ఏర్పాటు చేసినవిలేకరుల సమావేశంలో విమర్శించారు. ఉచితవిద్యుత్ ఇవ్వడం అనేది అసంభం అని ప్రజలుఅందరికీ తెలుసనని, ప్రజలు కాంగ్రెస్ మాటలను నమ్మరని టీడీపీపేర్కొంది.
మరోవైపు, కాంగ్రెస్ నేతలు కూడా హైదరాబాద్ లోవిలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ ఆరోపణలను తిప్పికొట్టింది. కాంగ్రెస్ ను చూసి టీడీపీ భయపెడుతోందని కాంగ్రెస్ నేతలుపేర్కొన్నారు.