కాశ్మీర్ లో 30 శాతం పోలింగ్
శ్రీనగర్: కాశ్మీర్ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 23 నియోజకవర్గాల్లో సోమవారం జరిగిన ఎన్నికల్లో 30 శాతం ఓట్లు నమోదయ్యాయి. తీవ్రవాదులు అనేక చోట్ల ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలువిపలమయ్యాయి.
వేర్వేరు
ప్రాంతాల్లో
తీవ్రవాదులు
జరిపిన
దాడుల్లో
ఆరుగురు
మరణించినట్లు
తెలుస్తోంది.
తీవ్రవాదుల
బెదరింపులను
లెక్కచేయకుండా
ఓటర్లుస్వచ్ఛందంగా
పోలింగ్
లో
పాల్గొనడం
విశేషం.
తొలిదశ
ఎన్నికల్లో
చెదురుముదురు
సంఘటనలుమినహా
పెద్దగా
రక్తపాతం
లేకపోవడంతో
అధికారులు
ఊపిరిపీల్చుకున్నారు.
ఓ పోలింగ్ కేంద్రంపై తీవ్రవాదులు జరిపిన దాడిలో మాత్రం ఓ కానిస్టేబులు మృతిచెందాడు. మరికొందరు గాయపడ్డారు. 9 గంటలపాటు పోలింగ్ సాగింది.పెద్ద ఎత్తున సైన్యాన్ని దింపారు.16 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ఎన్నికల తీరును పరిశీలించారు. తొలిసారిగా కాశ్మీర్లో ఈ సారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించారు.
పోలింగ్ శాతం ఒక్కో ప్రాంతంలో ఒక్కోతీరుగా ఉంది. రాజౌరి, పూంఛ్ జిల్లాల్లో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనగా, కీలకమైన బారాముల్లా,కుప్వారా ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ లో పాల్గొనేందుకు జంకారు. అయితే,ఊరి, నౌషారా నియోజకవర్గాల్లో 47 శాతం వరకు పోలింగ్ నమోదు కావడంవిశేషం.