సేలంలోపేలుడు-20 మంది మృతి
చెన్నైః తమిళనాడు లోనిసేలంలో వ్యాన్ లో రెండు సిలిండర్లు తీసుకువెళుతున్న సమయంలో సంభవించినపేలుడులో 20 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు.సేలం సమీపంలోని అతూర్ పట్టణంలో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదస్థలంలో ఇంతవరకు 16 మృతదేహాల్ని కనుగొన్నట్లు తమిళనాడు డిజిపి నైల్ వాల్ చెప్పారు. దీపావళి కోసం తయారు చేసిన టపాకాయలు వుంచిన వ్యాన్ లో గ్యాస్ సిలిండర్లు వుంచుతున్న సందర్భంగా ఈ దుర్ఘటన జరిగింది. వ్యాన్ లో వున్న టపాకాయలకు ప్రమాదవశాత్తు నిప్పుఅంటుకుందని, ఆ తరువాత సిలిండర్లు కూడా పేలడంతో ఈఘోరం జరిగిందని భావిస్తున్నారు.
పేలుడు
తీవ్రతకు
ఆ
వీధిలో
వున్న
14
ఇళ్ళు
కూడా
పాక్షికంగా
దెబ్బతిన్నాయని
పోలీసులు
చెప్పారు.
ఈ
ప్రమాదంలో
కనీసం
25
మంది
తీవ్రంగా
గాయపడ్డారు.
గాయపడిన
వారిని
హుటాహుటిన
ఆస్పత్రికి
తరలించారు.
పోలీసులు
వున్నతాధికారులు
ప్రమాదస్థలం
చేరుకున్నారు.