వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సేలంలోపేలుడు-20 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నైః తమిళనాడు లోనిసేలంలో వ్యాన్‌ లో రెండు సిలిండర్లు తీసుకువెళుతున్న సమయంలో సంభవించినపేలుడులో 20 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు.సేలం సమీపంలోని అతూర్‌ పట్టణంలో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదస్థలంలో ఇంతవరకు 16 మృతదేహాల్ని కనుగొన్నట్లు తమిళనాడు డిజిపి నైల్‌ వాల్‌ చెప్పారు. దీపావళి కోసం తయారు చేసిన టపాకాయలు వుంచిన వ్యాన్‌ లో గ్యాస్‌ సిలిండర్లు వుంచుతున్న సందర్భంగా ఈ దుర్ఘటన జరిగింది. వ్యాన్‌ లో వున్న టపాకాయలకు ప్రమాదవశాత్తు నిప్పుఅంటుకుందని, ఆ తరువాత సిలిండర్లు కూడా పేలడంతో ఈఘోరం జరిగిందని భావిస్తున్నారు.

పేలుడు తీవ్రతకు ఆ వీధిలో వున్న 14 ఇళ్ళు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంలో కనీసం 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వున్నతాధికారులు ప్రమాదస్థలం చేరుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X