వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్ లోహింస; ఒకరి మృతి
ఆనంద్: గుజరాత్ లో మళ్ళీహింస చెలరేగింది. రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాబర్సాద్ పట్టణంలో సోమవారం రాత్రి నుంచి జరుగుతోన్న ఘర్షణలో ఒకరుమరణించారు. 13 మంది గాయపడ్డారు. రెండువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు రంగప్రవేశంచేశారు. లాఠీఛార్జీ జరిపి అల్లరి మూకలనుచెదరగొట్టేందుకు ప్రయత్నించారు.
కానీ అల్లరిమూకలు రెచ్చిపోయిపోలీసులపై రాళ్ళు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగామారింది. దీంతో పోలీసులు గాల్లోకి 31 రౌండ్లు కాల్పులుజరిపారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులుగాయపడ్డారు. పరిస్థితి ఎంతకీఅదుపులోకి రాకపోవడంతో అక్కడ కర్ఫ్యూవిధించారు. అదనపు బలగాల సహాయాన్ని కూడా కోరినట్లుఅధికారులు తెలిపారు.
Comments
Story first published: Tuesday, September 17, 2002, 23:53 [IST]