వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్ పత్రికల దుష్ప్రచారంః వకార్
ఇస్లామాబాద్ః ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ పోటీల్లో పాకిస్తాన్ - శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాయనే వార్తలను పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు త్రోసిపుచ్చింది. సెప్టెంబర్ 12న ఈ రెండు దేశాల మధ్య జరిగిన మ్యాచ్ లో జరిగిన పలు సంఘటనలను పరిశీలిస్తున్నట్లు ఐసిసి ప్రకటించింది. అయితే ఐసిసి ఇంతవరకు తమను సంప్రదించలేదని పాక్ తెలిపింది.
కొన్ని భారతీయ పత్రికలు పనికట్టుకొని ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నాయని జట్టు మేనేజర్ ముజాహిద్ ఆరోపించారు. భారతీయ పత్రికలు మరింత హుందాగా వ్యవహరించాల్సింది అని ఆయన ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. మ్యాచ్ టేపులు పరిశీలించడంసర్వసాధారణం, అయితే భారత్ పత్రికలు ఏదో జరిగిపోయిందని దుష్ప్రచారం చేయడం బాధాకరం అని ఆయన అన్నారు.
Comments
Story first published: Tuesday, September 17, 2002, 23:53 [IST]