వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్‌ బిల్లుల వసూలు వాయిదాః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

నల్గొండః కరవు పీడిత రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాలు ప్రకటించారు. కరవు ప్రాంతాల్లో వ్యవసాయ పంపుసెట్లవిద్యుత్‌ బిల్లులు మాఫీ చేయడంతో పాటు, కరవును ఎదుర్కొంటున్న రైతులవిద్యుత్‌ బిల్లుల బకాయల వసూళ్లు వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం రాత్రి ఆయన నల్గొండలో ప్రకటించారు. నల్గొండ జిల్లా భువనగిరి రెవెన్యూ డివిజన్‌ లోని పలు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. నల్గొండలో కరవు పరిస్థితి తీవ్రంగా వున్నదని, రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన ప్రకటించారు.

రిజర్వాయర్లలో నీటిమట్టాలు సరిగా లేకవిద్యుత్‌ ఉత్పత్తి తగిన మేరకు లేదని, ప్రజలు పరిస్ధితిఅర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ఎండిన పంటలను చూపుతూ రైతులు ముఖ్యమంత్రికి ఆవేదన తెలిపారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా తొమ్మిది గంటలవిద్యుత్‌ సరఫరా జరగడం లేదని మహిళలు సిఎం ను ప్రశ్నించారు. నల్గొండ జిల్లా పర్యటన అనంతరం చంద్రబాబు మెదక్‌ లో పర్యటించారు. మెదక్‌ లో కూడా బాబు రైతుల ఆగ్రహాన్ని, ఆవేదనను చవిచూడాల్సి వచ్చింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X