వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విద్యుత్ బిల్లుల వసూలు వాయిదాః బాబు
నల్గొండః కరవు పీడిత రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాలు ప్రకటించారు. కరవు ప్రాంతాల్లో వ్యవసాయ పంపుసెట్లవిద్యుత్ బిల్లులు మాఫీ చేయడంతో పాటు, కరవును ఎదుర్కొంటున్న రైతులవిద్యుత్ బిల్లుల బకాయల వసూళ్లు వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం రాత్రి ఆయన నల్గొండలో ప్రకటించారు. నల్గొండ జిల్లా భువనగిరి రెవెన్యూ డివిజన్ లోని పలు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. నల్గొండలో కరవు పరిస్థితి తీవ్రంగా వున్నదని, రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన ప్రకటించారు.
Comments
Story first published: Saturday, September 21, 2002, 23:53 [IST]