వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌ మృతుల సంఖ్య నాలుగు

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా గుజరాత్‌లోని వడొదర నగరంలో శుక్రవారం చెలిరేగిన హింసలో మరణించినవారి సంఖ్య నాలుగుకు చేరింది. కత్తిపోట్లకుగురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఒకరు మరణించారు. అల్లర్లు చెలరేగిన ప్రాంతంలో పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నదని పోలీసు వర్గాలు చెప్పాయి.

గణేశ్‌ ఉరేగింపు సందర్భంగా ఫతేపురా ప్రాంతంలో చెలరేగిన హింసలో ముగ్గురు మరణించారు. 27 మంది గాయపడ్డారు. ఇందులో ఒకరు పోలీసు కాల్పుల్లో మరణించగా, ఇద్దరు కత్తిపోట్లకుగురై మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మరణించాడు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.

పోలీసు కాల్పుల్లో ఒక హోమ్‌ గార్డ్‌ జవాను కూడా గాయపడ్డాడు. వడొదరలోని ఫతేపురా, మచిపీఠ్‌, రావ్‌పురాలలో చెలరేగిన అల్లర్లలో హోమ్‌ గార్డ్‌తో పాఉట 22 మంది పోలీసులు గాయపడ్డారు.

శుక్రవారం ప్రార్థనలు చేసి మసీదు నుంచి బయటకు వచ్చిన ముస్లింలకు గణేశ్‌ ఊరేగింపు ఎదురు రావడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పరస్పరం రాళ్లు, యాసిడ్‌సీసాలు విసురుకున్నారు. అల్లరి మూకలను చెదరగొట్టడానికి 47 రౌండ్లు కాల్పులు జరిపారు. 147 టియర్‌ గ్యాస్‌షెల్స్‌ వదిలారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X