వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్ మృతుల సంఖ్య నాలుగు
అహ్మదాబాద్:
గణేశ్
నిమజ్జనం
సందర్భంగా
గుజరాత్లోని
వడొదర
నగరంలో
శుక్రవారం
చెలిరేగిన
హింసలో
మరణించినవారి
సంఖ్య
నాలుగుకు
చేరింది.
కత్తిపోట్లకుగురై
ఆస్పత్రిలో
చికిత్స
పొందుతూ
శుక్రవారం
రాత్రి
ఒకరు
మరణించారు.
అల్లర్లు
చెలరేగిన
ప్రాంతంలో
పరిస్థితి
ప్రశాంతంగానే
ఉన్నదని
పోలీసు
వర్గాలు
చెప్పాయి.
పోలీసు కాల్పుల్లో ఒక హోమ్ గార్డ్ జవాను కూడా గాయపడ్డాడు. వడొదరలోని ఫతేపురా, మచిపీఠ్, రావ్పురాలలో చెలరేగిన అల్లర్లలో హోమ్ గార్డ్తో పాఉట 22 మంది పోలీసులు గాయపడ్డారు.
శుక్రవారం ప్రార్థనలు చేసి మసీదు నుంచి బయటకు వచ్చిన ముస్లింలకు గణేశ్ ఊరేగింపు ఎదురు రావడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పరస్పరం రాళ్లు, యాసిడ్సీసాలు విసురుకున్నారు. అల్లరి మూకలను చెదరగొట్టడానికి 47 రౌండ్లు కాల్పులు జరిపారు. 147 టియర్ గ్యాస్షెల్స్ వదిలారు.
Comments
Story first published: Saturday, September 21, 2002, 23:53 [IST]