వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నదీజలాలపై అఖిలపక్షం: కడియం

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: నదీజలాలపై చర్చించేందుకు త్వరలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. కృష్ణా జిల్లా పర్యటనకు ఆయన వచ్చిన ఆయన శనివారంవిలేకరులతో మాట్లాడారు.

నదీ జలాలవిషయంలో కర్ణాటక నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను, జిల్లాల మధ్య జలాల పంపిణీలో ఎదుర్కుంటున్న సమస్యలను చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వర్షాలు సరిగా పడకపోవడం వల్ల కోటి ఎకరాల్లో పడాల్సిన నాట్లు రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో మాత్రమే పడ్డాయని ఆయన చెప్పారు. కర్ణాటక 128.5 టిఎంసిల కృష్ణా జలాలను నిల్వ చేసిందని, ఆంధ్రప్రదేశ్‌కు నీరు వదలడం లేదని, నిల్వ చేసిన నీటిని కర్ణాటక ఏం చేస్తుందో తెలియదని మంత్రి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X