వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడి మూడోదశగౌరవ యాత్ర

By Staff
|
Google Oneindia TeluguNews

సూరత్‌: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తన మూడవ దశ గౌరవ యాత్రను శనివారం నవసారి జిల్లాలోని ఉన్నాయ్‌ గ్రామం నుంచి ప్రారంభించారు. తన నాలుగు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్‌ గిరిజనులకు, బలహీన వర్గాలకు మౌలిక సదుపాయాలను కల్పించలేదని ఆయన ఈ సందర్భంగావిమర్శించారు. ఈ వర్గాల అభివృద్ధికి, గ్రామాల్లో ప్రాథమిక సౌకర్యాల కల్పనకు తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు.

గిరిజనులు తమ కలలను సాకారం చేసుకోవడానికి బిజెపి సహకరించిందని ఆయన చెప్పారు. గౌరవ యాత్ర ప్రారంభానికి ముందు మోడి గిరిజనుల దైవం ఉన్న ఉన్నైలోని దేవాలయంలో పూజలు నిర్వహించారు. వచ్చేఅసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే దేవాలయ మరమ్మతులకు మూడున్నర కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఆయన దేవాల ట్రస్టుకు హామీ ఇచ్చారు.
ఈ యాత్ర దంగ్స్‌, నవసారి, బుల్సార్‌, సూరత్‌ జిల్లాలమీదుగా 16 శాసనసభా నియోజకవర్గాల్లో సాగుతుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X