వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడుకు వాజ్‌పేయి హామీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక నుంచి కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయిస్తానని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు హామీ ఇచ్చారు.

67 మందితో కూడిన అఖిల పక్ష బృందంతో జయలలిత శనివారం సాయంత్రం ప్రధానితో దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. రాజ్యాంగంలోని 355 ఆర్టికల్‌ కింద కావేరీ జలాల విడుదలకు కర్ణాటకకు ఆదేశాలు జారీ చేయాలని జయలలిత వాజ్‌పేయినికోరారు.

సమావేశానంతరం కనీసం విలేకరులతో కూడా మాట్లాడకుండా జయలలిత ప్రధాని నివాసం నుంచి వెళ్లిపోయారు. తమిళనాడుకు కర్ణాటక నుంచి నీరు విడుదల చేయించడానికి అన్ని విధాలా కృషి చేస్తానని ప్రధాని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్‌ నేత ఎస్‌.ఆర్‌. బాలసుబ్రహ్మణ్యన్‌విలేకరులతో చెప్పారు.

డిఎంకె, సిపిఎం, పుధగై తమిళ్‌ ఇఝంలు మినహామిగతా రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ వాజ్‌పేయిని కలుసుకున్న బృందంలో ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X