వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎండిన బావులకు బిల్లులు మాఫీ

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: ఎండిపోయిన బావుల మోటార్లకు కరెంటు బిల్లులను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఆయన శనివారం వరంగల్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనవిలేకరులతో మాట్లాడారు.

కరవు ప్రాంతాల్లోని రైతులకు కరెంటు బిల్లుల చెల్లింపులో రాయితీలు ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. వర్షాభావ పరిస్థితుల వల్ల 24 గంటలు కరెంటు సరఫరా చేస్తామని తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయామని ఆయన అన్నారు. వర్షాలు పడకపోవడం వల్ల ఎండాకాలంలో మాదిరిగావిద్యుత్‌ వినియోగం ఎక్కువగా జరుగుతోందని ఆయన చెప్పారు. జలాశయాల్లో తగిన నీరు లేకవిద్యుదత్పత్తి కూడా మందగించిందని ఆయన అన్నారు. ప్రజలకు నిరంతరం కరెంట్‌అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, అయితే పరిస్థితులు అనుకూలించడం లేదని ఆయన చెప్పారు.

క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. డ్వాక్రా అమలు తీరును పరిశీలించారు. ఎంజిఎం ఆస్పత్రిని సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X