వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రతో కర్నాటక జగడం
బెంగుళూరుః కావేరీ జలాలవివాదంలో పీకలదాకా కూరుకుపోయిన కర్నాటక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తో జగడం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేటాయించిన దానికంటే ఎక్కువ కృష్ణా జలాలలను వాడుకుంటున్నదని కర్నాటక నీటిపారుదల శాఖ మంత్రి పాటిల్ శుక్రవారం బెంగుళూరులో ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేంద్రజల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయనవిలేకర్ల సమావేశంలో చెప్పారు.
గురువారం బెంగుళూరు వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఎస్.ఎం. కృష్ణకు ఫోన్ చేసిమీకు విద్యుత్ ఇస్తాం, మాకు కృష్ణా జలాలు ఇవ్వండని అడిగినట్లు తెలిసింది.మీ ప్రతిపాదనను పరిశీలిస్తాం అని చెప్పిన కృష్ణ తెల్లారే సరికి ఆంధ్రపై ఆరోపణలకు దిగడం అన్యాయం అని పరిశీలకులు భావిస్తున్నారు.
Comments
Story first published: Friday, September 27, 2002, 23:53 [IST]