వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రతో కర్నాటక జగడం

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరుః కావేరీ జలాలవివాదంలో పీకలదాకా కూరుకుపోయిన కర్నాటక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ తో జగడం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కేటాయించిన దానికంటే ఎక్కువ కృష్ణా జలాలలను వాడుకుంటున్నదని కర్నాటక నీటిపారుదల శాఖ మంత్రి పాటిల్‌ శుక్రవారం బెంగుళూరులో ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేంద్రజల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయనవిలేకర్ల సమావేశంలో చెప్పారు.

కావేరీ జలాలవిషయంలో ఇప్పటికే జయలలితతో జగడంపెట్టుకున్న కర్నాటక తాజాగా తన దృష్టిని ఆంధ్రప్రదేశ్‌ పై సారించింది. కృష్ణా జలాలను మన రాష్ట్రానికి కానివ్వకుండా ఆల్‌ మట్టి వంటి డ్యాం లను నిర్మిస్తూ అత్తగారి పెత్తనం సాగిస్తున్న కర్నాటకపై ఆంధ్రప్రభుత్వం ఇప్పటి వరకు మర్యాదగానే వ్యవహరిస్తున్నది.

గురువారం బెంగుళూరు వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఎస్‌.ఎం. కృష్ణకు ఫోన్‌ చేసిమీకు విద్యుత్‌ ఇస్తాం, మాకు కృష్ణా జలాలు ఇవ్వండని అడిగినట్లు తెలిసింది.మీ ప్రతిపాదనను పరిశీలిస్తాం అని చెప్పిన కృష్ణ తెల్లారే సరికి ఆంధ్రపై ఆరోపణలకు దిగడం అన్యాయం అని పరిశీలకులు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X