వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్థికాభివృద్ధికి సమన్వయం: వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధి లక్ష్య సాధనకు రాజకీయ పార్టీల మధ్య సమన్వయం అవసరమని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. బారత కార్మిక సమవేశంలో ఆయన శనివారం ప్రసంగించారు. రాజకీయ పార్టీలువిశాల దృక్పథంతో ఆర్థికాభివృద్ధికి రాజకీయ పార్టీలు ముందుకు రావాలని ఆయన అన్నారు.

తీవ్రవాదంపై రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయని, ఇదే విధమైన ఏకాభిప్రాయం ఆర్థికాభివృద్ధివిషయంలో రావాలని ఆయన అన్నారు. పార్టీలన్నీ ఇందుకు సహకరించాలని ఆయన అన్నారు. ఎనిమిది శాతం వృద్ధి రేటును సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యమని అయన చెప్పారు. ఆర్థికసంక్షోభం నుంచి దేశం బయట పడాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆర్థిక సంస్కరణల అమలు సందర్భంలో కార్మికుల సామాజిక భద్రతకు హానీ కలగుకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్మికుల సమస్య పరిష్కారానికి యాజమాన్యాల, ప్రభుత్వ, కార్మిక సంఘాల త్రైపాక్షిక చర్చలే శరణ్యమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X