వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలోచనే ప్రగతికి మూలంః కలాం

By Staff
|
Google Oneindia TeluguNews

అగర్తలాః ఆలోచన అనేదివిజ్ఞాన సముపార్జనకు తద్వారా దేశ సర్వతోముఖాభివృద్ధికి అత్యంత అవసరమని రాష్ట్రపతి డాక్టర్‌ అబ్దుల్‌ కలాం అన్నారు. భారత దేశం ఏరంగంలో అభివృద్ధి చెందాలన్నా ఆలోచనే ప్రధానమని, ఆలోచనే పెట్టుబడి అని ఆయనవిద్యార్థులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అన్నారు.
ప్రతి వ్యక్తికి ఒక దృక్పథం వుంటుంది అది ఆలోచనతోనే రాటుదేలుతుందని కలాం అన్నారు. కలాం రాష్ట్రపతి పదవి చేపట్టిన తరువాత త్రిపుర సందర్శించడం ఇదే ప్రథమం. ఇక్కడి రవీంద్ర భవన్‌ లో ఆయన స్కూలు పిల్లలతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

కొందరు ప్రతిభావంతులైనవిద్యార్థులు విదేశాలకు తరలి వెళ్లి పోతున్నారు కదా దేశానికి అది చేటు కాదా అనివిద్యార్థులు ప్రశ్నించగా, అలా వెళ్ళే వారు చాలా కొద్ది మంది మాత్రమే..అందువల్ల నష్టం పెద్దగా వుండబోదని కలాం వ్యాఖ్యానించారు. వారు విదేశాల్లో వుండి కూడా మాతృదేశం అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X