వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరు చెప్పినా నీళ్ళు వదలంః కృష్ణ

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరుః తమిళనాడుకు ఒక చుక్కకూడా కావేరీ జలాలను విడుదల చేసే ప్రసక్తి లేదని కర్నాటక ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. కృష్ణ తేల్చి చెప్పారు. తమిళనాడుకు రోజూ 9 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై కృష్ణ రాష్ట్ర క్యాబినెట్‌ ను అత్యవసరంగా సమావేశపరచారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంధ్య పట్టణంలో బంద్‌ నిర్వహించారు. బెంగుళూరు - మైసూరు మధ్య ట్రాఫిక్‌ మళ్ళిస్తున్నారు.

తమిళనాడుకు నీళ్ళు వదిలితే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నవిషయం విదితమే. మైసూర్‌ లో ఉద్యమకారులంతా సమావేశమై భవిష్యత్‌ వ్యూహాన్ని రూపొందిస్తున్నారు.మిలటరీని రంగంలోకి దించినా సరే.... తమిళనాడుకు నీళ్ళు వదిలే ప్రసక్తి లేదని కావేరీ నది పరిరక్షణ కమిటీ సారధ్‌ మాదె గౌడ కరాఖండిగా చెప్పారు.

కావేరి రివర్‌ అధారిటీని వెంటనే సమావేశపరచాల్సిందిగా ప్రధాని వాజ్‌పేయిని కోరతామని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు దరిమిలామిగిలిన ఒక్క మార్గం అదేనని ఆయన అభిప్రాయ పడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X