వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎవరు చెప్పినా నీళ్ళు వదలంః కృష్ణ
బెంగుళూరుః తమిళనాడుకు ఒక చుక్కకూడా కావేరీ జలాలను విడుదల చేసే ప్రసక్తి లేదని కర్నాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ తేల్చి చెప్పారు. తమిళనాడుకు రోజూ 9 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై కృష్ణ రాష్ట్ర క్యాబినెట్ ను అత్యవసరంగా సమావేశపరచారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంధ్య పట్టణంలో బంద్ నిర్వహించారు. బెంగుళూరు - మైసూరు మధ్య ట్రాఫిక్ మళ్ళిస్తున్నారు.
కావేరి రివర్ అధారిటీని వెంటనే సమావేశపరచాల్సిందిగా ప్రధాని వాజ్పేయిని కోరతామని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు దరిమిలామిగిలిన ఒక్క మార్గం అదేనని ఆయన అభిప్రాయ పడ్డారు.
Story first published: Friday, October 4, 2002, 23:53 [IST]