వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తమిళనాడుకు నీళ్ళివ్వాల్సిందేః సుప్రీం
న్యూఢిల్లీః తమిళనాడు రాష్ట్రానికి రోజూ 9 వేల క్యూసెక్కుల నీళ్ళు విడుదల చేసి తీరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.సెప్టెంబర్ 8న ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కర్నాటక ప్రభుత్వం రోజూ నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది. జస్టిస్ కిర్పాల్ సారధ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసునువిచారించింది. తమిళనాడుకు నీళ్ళు ఇవ్వడాన్ని నిలిపివేసిన కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించిందంటూ జయప్రభుత్వం కోర్టు ధిక్కార పటిషన్ దాఖలు చేసినవిషయం విదితమే. ఈ కేసు విచారణను కోర్టు ఆక్టోబర్ 24 కు వాయిదా వేసింది.
Story first published: Friday, October 4, 2002, 23:53 [IST]