వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీకాంత్‌ దిష్టిబొమ్మ దగ్ధం

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: కావేరీ జలాలవివాదం విషయంలో చేసిన ప్రకటనకు నిరసనగా భారత దళిత పాంథర్స్‌విద్యార్థి విభాగం కార్యకర్తలు ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ దిష్టబొమ్మను దగ్ధం చేశారు.
కావేరీ జలాల వివాదంపై నైవేలీలో తలపెట్టిన ర్యాలీవిషయంలో తమ నిర్ణయాన్ని పునః పరిశీలించుకోవాలని ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ చేసిన ప్రకటనను నిరసిస్తూ వారు శనివారంసైదాపేట్‌లో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

రజనీకాంత్‌ ప్రకటన పట్ల ఆయన అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నైవేలీ ర్యాలీలో రజనీకాంత్‌ పాల్గొనాలని వారు కోరుతున్నారు. తమిళనాడు ప్రయోజనాలకువిరుద్ధమైన పనేది రజనీకాంత్‌ చేయరని వారంటున్నారు.

ఇదిలావుంటే, కావేరీ జలాలను వెంటనే విడుదల చేయాలని కర్ణాటకను డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్లు జనతాదళ్‌-సెక్యులర్‌ (జెడి-ఎస్‌) తమిళనాడు శాఖ శనివారం ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా కర్ణాటక బేఖాతరు చేయడం తీవ్రంగా ఖండనీయమని జెడి-ఎస్‌ తమిళనాడు అధ్యక్షుడుసి. బాలరామన్‌ శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X