బాణాసంచా పేలి 13మంది మృతి
హైదరాబాద్: హైదరాబాద్ లోని ఓ బాణాసంచా దుకాణంలో బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 13 మంది మరణించారు. పదహారు మంది గాయపడ్డారు. తెల్లవారుఝామున ఈ ఘటన జరిగింది. ఉస్మాన్ గంజ్ లో రోడ్డు మీదే ఉన్న కార్తికేయ హోటల్ కింది ఫ్లోర్ లో బాణాసంచా దుకాణం ఉంది.
బాణాసంచా ప్రమాదవశాత్తూ పేలడంతో నాలుగు అంతస్తుల ఈ భవంతి అంతా మంటలు వ్యాపించాయి. పైన లాడ్జ్ లో ఉన్న వారు హాహాకారాలు చేస్తూ బయటికి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, భారీస్థాయిలో పేలుడు జరగడంతో 13 మంది సజీవదహనం అయ్యారు.
విచారణ
కమిటీ
ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు,
హోంమంత్రి
దేవేందర్
గౌడ్,
డిజిపి
పేర్వారం
రాములు,
ఇతర
ఉన్నతాధికారులు
ఘటనాస్థలాన్ని
వెంటనే
సందర్శించి
బాధితులను
పరామర్శించారు.
ఘటనపై
విచారణ
కమిటీని
వేసినట్లు
ముఖ్యమంత్రి
ప్రకటించారు.
ఇక
నుంచి
నగరంలో
బాణాసంచా
దుకాణాలకు
అనుమతించబోమని
తెలిపారు.
మలక్ పేట సహా అన్ని ప్రాంతాల్లో ఉన్న ఈ దుకాణాలను నగరం అవతలకి తరలిస్తామన్నారు. పండుగల సందర్భంగా వీటి అమ్మకాన్ని కూడా కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లోనే అనుమతిస్తామని చెప్పారు. ఈ బాణాసంచా దుకాణపు యజమానిని అదుపులోకి తీసుకున్నారు.