వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాణాసంచా పేలి 13మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోని ఓ బాణాసంచా దుకాణంలో బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 13 మంది మరణించారు. పదహారు మంది గాయపడ్డారు. తెల్లవారుఝామున ఈ ఘటన జరిగింది. ఉస్మాన్‌ గంజ్‌ లో రోడ్డు మీదే ఉన్న కార్తికేయ హోటల్‌ కింది ఫ్లోర్‌ లో బాణాసంచా దుకాణం ఉంది.

బాణాసంచా ప్రమాదవశాత్తూ పేలడంతో నాలుగు అంతస్తుల ఈ భవంతి అంతా మంటలు వ్యాపించాయి. పైన లాడ్జ్‌ లో ఉన్న వారు హాహాకారాలు చేస్తూ బయటికి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, భారీస్థాయిలో పేలుడు జరగడంతో 13 మంది సజీవదహనం అయ్యారు.

వీరిలో ఒక మహిళ కూడా ఉంది. కొంతమంది తప్పించుకునేందుకు ప్రయత్నించగా, 16 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచాను నిల్వ ఉంచారు. ప్రమాదవశాత్తూ పేలడంతో ఆ భవంతి మొత్తం మంటలు వ్యాపించాయి. మంగళవారం నాడే రెండు లారీల లోడ్‌ ను ఈ దుకాణంలో నిల్వ ఉంచారు.

విచారణ కమిటీ
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, హోంమంత్రి దేవేందర్‌ గౌడ్‌, డిజిపి పేర్వారం రాములు, ఇతర ఉన్నతాధికారులు ఘటనాస్థలాన్ని వెంటనే సందర్శించి బాధితులను పరామర్శించారు. ఘటనపై విచారణ కమిటీని వేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇక నుంచి నగరంలో బాణాసంచా దుకాణాలకు అనుమతించబోమని తెలిపారు.

మలక్‌ పేట సహా అన్ని ప్రాంతాల్లో ఉన్న ఈ దుకాణాలను నగరం అవతలకి తరలిస్తామన్నారు. పండుగల సందర్భంగా వీటి అమ్మకాన్ని కూడా కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లోనే అనుమతిస్తామని చెప్పారు. ఈ బాణాసంచా దుకాణపు యజమానిని అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X