వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రసకందాయంలో యూపీ రాజకీయం

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజకీయం రసకందాయంలో పడింది. మాయవతి సంకీర్ణప్రభుత్వం పతనం అంచున నిలబడింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక తొమ్మిదిమంది ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. గవర్నర్‌ విష్ణుకాంత్‌ శాస్త్రిని కలిసి మద్దతు ఉపసంహరించుకున్నట్లు వివరించారు.

యూపీలో గత కొద్ది రోజులుగా సాగుతోన్న రాజకీయ డ్రామా శుక్రవారం ఊపందుకొంది. బిజెపి-బిఎస్‌ పి సంకీర్ణప్రభుత్వ పనితీరుపై బిజెపి ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. బిజెపిలో చీలిక అంచున ఉండగా, స్వతంత్ర అభ్యర్థులు తొలుత స్పందించడంతో మాయవతి ప్రభుత్వం ప్రమాదంలో పడింది.

మరోవైపు, సమాజ్‌ వాది పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. కాంగ్రెస్‌ తమకు మద్దతు ఇవ్వాలని కోరింది. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఎస్‌.పి సీనియర్‌ నేత అమర్‌ సింగ్‌ అప్పుడే చర్చలు ప్రారంభించారు. 403 మంది సభ్యుల గల యూపీ అసెంబ్లీలో బిజెపి-బి.ఎస్‌.పి బలం187. సమాజ్‌ వాది పార్టీకి 142 ఎమ్మెల్యేలున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు మాయవతి ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని బిజెపి నేత లాల్జీ టాండన్‌ తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X