వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రసకందాయంలో యూపీ రాజకీయం
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయం రసకందాయంలో పడింది. మాయవతి సంకీర్ణప్రభుత్వం పతనం అంచున నిలబడింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక తొమ్మిదిమంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. గవర్నర్ విష్ణుకాంత్ శాస్త్రిని కలిసి మద్దతు ఉపసంహరించుకున్నట్లు వివరించారు.
యూపీలో గత కొద్ది రోజులుగా సాగుతోన్న రాజకీయ డ్రామా శుక్రవారం ఊపందుకొంది. బిజెపి-బిఎస్ పి సంకీర్ణప్రభుత్వ పనితీరుపై బిజెపి ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. బిజెపిలో చీలిక అంచున ఉండగా, స్వతంత్ర అభ్యర్థులు తొలుత స్పందించడంతో మాయవతి ప్రభుత్వం ప్రమాదంలో పడింది.
Comments
Story first published: Friday, October 25, 2002, 23:53 [IST]