సంస్కరణల వల్ల సత్ఫలితాలు: బాబు
హైదరాబాద్: రాష్ట్రంలో గత పదేళ్లుగా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్రావతరణ సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు.
ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ,
విద్యుచ్ఛక్తి,
వైద్యం,
విద్యా
రంగాలపై
ప్రభుత్వం
ప్రత్యేక
శ్రద్ధ
పెట్టిందని,
ఈ
రంగాల్లో
రాష్ట్రం
దేశంలోనే
అగ్రస్థానంలో
ఉన్నదని
ఆయన
చెప్పారు.
అంతకు ముందు ముఖ్యమంత్రి తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద నివాళులర్పించారు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలన్నింటిలో రాష్ట్రావతరణ దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి.
రాష్ట్రావతరణ దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి విద్రోహదినంగా పాటించింది. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు ర్యాలీ నిర్వహించింది. హైదరాబాద్లోని సచివాలయం ఎదురుగా గల తెలంగాణ అమర వీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. తెలంగాణాలోని సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ఫోరమ్ డిమాండ్ చేసింది.