వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గ్యాస్ నిల్వలతో ఎపికి ఊతం: బాబు
హైదరాబాద్:
కృష్ణా-
గోదావరి
బేసిన్లో
కొత్తగా
కనుక్కున్న
భారీ
సహజవాయు
నిల్వల
వల్ల
దేశం
గ్యాస్
సెక్టార్లో
స్వయం
సమృద్ధి
సాధిస్తుందని
ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
చెప్పారు.
ఇది
ఆంధ్రప్రదేశ్
ఆర్థిక
రంగానికి
ఊతం
ఇస్తుందని
ఆయన
అభిప్రాయపడ్డారు.
ఫార్మాసిటీని, స్పెషల్ ఎకనమిక్ జోన్ను ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర కోస్తా తీరంలో సహజవాయువు నిల్వలు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయగలవని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని గ్యాస్ ఆధారిత విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులు కూడా వస్తాయని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, November 1, 2002, 23:53 [IST]