వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీం ఆదేశాలు అమలు: చంద్రగౌడ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేసే విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని కర్ణాటక న్యాయశాఖ మంత్రి డి.బి. చంద్రగౌడ శుక్రవారం చెప్పారు. తమిళనాడు ప్రతి రోజు 9 వేల క్యూసెక్స్‌ల నీరు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన కొద్ది గంటల అనంతరం మంత్రి ఆ విషయం చెప్పారు.

సాధ్యమవుతుందా, కాదా అనేది ప్రశ్న కాదని, తాము సుప్రీంకోర్టు ఆదేశాలను పాలించాల్సి ఉన్నదని, పాలిస్తామని ఆయన చెప్పారు. కర్ణాటకకు ఇది క్లిష్ట సమయమని, సమస్యలు ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాల్సి వున్నదని ఆయన అన్నారు. కావేరీ రివర్‌ అథారిటీ సమావేశాన్ని ప్రధాని ఎంత త్వరగా ఏర్పాటు చేస్తే తమకు అంత మంచిదని ఆయన చెప్పారు.

ఇదిలా వుంటే, తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ మాండ్యాలో రైతులు చేపట్టిన ఆందోళన శుక్రవారంనాటికి ఐదో రోజుకు చేరుకుంది. ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. కృష్ణ రాజీనామా చేయాలని, కర్ఫ్యూ ఎత్తివేయాలని, అరెస్టయిన రైతులను వదిలేయాలని డిమాండ్‌ చేస్తూ నాలుగు గ్రామాల రైతులు శుక్రవారం ధర్నా చేశారు. కర్ఫ్యూ ఉన్నప్పటికీ నిషేధాజ్ఞలను ధిక్కరించి వారు ధర్నాకు దిగారు. రోడ్లపై బైఠాయించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X