వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సుప్రీం ఆదేశాలు అమలు: చంద్రగౌడ
న్యూఢిల్లీ:
తమిళనాడుకు
కావేరీ
జలాలను
విడుదల
చేసే
విషయంలో
సుప్రీంకోర్టు
ఆదేశాలను
అమలు
చేస్తామని
కర్ణాటక
న్యాయశాఖ
మంత్రి
డి.బి.
చంద్రగౌడ
శుక్రవారం
చెప్పారు.
తమిళనాడు
ప్రతి
రోజు
9
వేల
క్యూసెక్స్ల
నీరు
విడుదల
చేయాలని
సుప్రీంకోర్టు
ఆదేశించిన
కొద్ది
గంటల
అనంతరం
మంత్రి
ఆ
విషయం
చెప్పారు.
ఇదిలా వుంటే, తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ మాండ్యాలో రైతులు చేపట్టిన ఆందోళన శుక్రవారంనాటికి ఐదో రోజుకు చేరుకుంది. ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ రాజీనామా చేయాలని, కర్ఫ్యూ ఎత్తివేయాలని, అరెస్టయిన రైతులను వదిలేయాలని డిమాండ్ చేస్తూ నాలుగు గ్రామాల రైతులు శుక్రవారం ధర్నా చేశారు. కర్ఫ్యూ ఉన్నప్పటికీ నిషేధాజ్ఞలను ధిక్కరించి వారు ధర్నాకు దిగారు. రోడ్లపై బైఠాయించారు.
Comments
Story first published: Friday, November 1, 2002, 23:53 [IST]