వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదు వేల గ్రామాలకు ఆన్‌లైన్‌ పాలన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయంలో కాగితాలతో పని లేని ఆన్‌లైన్‌ పాలన నెల రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం 14 ప్రభుత్వ శాఖల్లో ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌ ద్వారా కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా స్మార్ట్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించారు.

రాష్ట్రంలోని ఐదు వేల పల్లెల్లో ఏడాదిలోగా ఆన్‌లైన్‌ పాలన అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఐదు వేల గ్రామాల్లోని ఎస్‌టిడి బూత్‌లను ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ద్వారా అనుసంధానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. సచివాలయంలోని ప్రభుత్వ శాఖలన్నింటిలో కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ ద్వారా కార్యకలాపాలు సాగుతాయని ఆయన చెప్పారు. సచివాలయంలోని 33 ప్రభుత్వ శాఖలు ఇంటర్నెట్‌ ద్వారానే తమ కార్యకలాపాలు సాగిస్తాయని ఆయన అన్నారు. పోర్టల్‌ నుంచి సర్వీసులకు అనుసంధానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. సచివాలయంలోని రెండు లక్షల ఫైళ్లను ఇంటర్నెట్‌లో ఉంచుతామని ఆయన చెప్పారు. 25 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును టాటా కన్సల్టెన్సీ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X