వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

16 నుంచి శబరిమలఓపెన్‌!

By Staff
|
Google Oneindia TeluguNews

పత్తినంత్తిట: మకరజ్యోతి సీజన్‌ భక్తుల కోసం శబరిమలైలోని అయ్యప్ప దేవాలయం ఈ నెల 16 నుంచి తెరిచి ఉంటుందని శబరిమల అయ్యప్పా సేవా సంఘం ప్రకటించింది. కేరళలోని పత్తినంత్తిట జిల్లాలోని దట్టమైన అడవుల మధ్య ఉండే శబరిమలై అయ్యప్ప దేవాలయం ఈ సీజన్‌ లో మినహా సాధారణంగా భక్తులకు మూసే ఉంటుంది.

ఏటా లక్షలాది భక్తులు నవంబర్‌ నుంచి మొదలయ్యే సీజన్‌ లో స్వామిని దర్శించుకుంటారు. అయితే, చిత్రపండుగను పురస్కరించుకొని దేవాలయాన్ని శనివారం సాయంత్రం అయిదు గంటలకు తెరుస్తామని సంఘం శుక్రవారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్‌ 3న పండుగ కాబట్టి శనివారం సాయంత్రం నుంచే స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని తెలిపారు.

మళ్ళీ ఆదివారం రాత్రి 10 గంటలకు దేవాలయాన్ని తాత్కలికంగా భక్తులకు మూసివేస్తారు. నవంబర్‌ 16 నుంచి నిరవధికంగా తెరుస్తామని సంఘం తెలిపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X