గవర్నర్ను కలిసిన ఎస్పి బృందం
లక్నో:
ఉత్తరప్రదేశ్
రాజకీయాలు
మరో
మలుపు
తిరిగాయి.
ప్రభుత్వ
ఏర్పాటుకు
తమకు
అవకాశం
ఇవ్వాలని
సమాజ్వాదీ
పార్టీ
(ఎస్పి),
దాని
మిత్రపక్షాలు
గవర్నర్
విష్ణుకాంత్
శాస్త్రిని
కలిసి
కోరాయి.
తమకు
శాసనసభలో
204
మంది
సభ్యుల
బలం
ఉన్నదని
ఆ
పార్టీలు
చెప్పుకున్నాయి.
తమకు మద్దతు ఇస్తున్న 204 మంది శాసనసభ్యుల పేర్లతో కూడిన జాబితాను ఈ ప్రతినిధి బృందం గవర్నర్కు సమర్పించింది. ఈ జాబితాలో కాంగ్రెస్ శాసనసభ్యుల పేర్లు గానీ, 37 మంది బిజెపి తిరుగుబాటు శాసనసభ్యుల పేర్లు గానీ లేవు.
తాము మాయావతి సర్కార్కు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు గానీ, ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని గానీ తనను కలిసిన బిజెపి శాసనసభ్యులు చెప్పలేదని గవర్నర్ తమతో అన్నట్లు అమర్ సింగ్ విలేకరులతో చెప్పారు. మాయావతి ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయామని మాత్రమే వారు చెప్పినట్లు గవర్నర్ తెలిపారని ఆయన అన్నారు.