వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్‌ను కలిసిన ఎస్‌పి బృందం

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి), దాని మిత్రపక్షాలు గవర్నర్‌ విష్ణుకాంత్‌ శాస్త్రిని కలిసి కోరాయి. తమకు శాసనసభలో 204 మంది సభ్యుల బలం ఉన్నదని ఆ పార్టీలు
చెప్పుకున్నాయి.

సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్‌ సింగ్‌ నేతృత్వంలో శాసనసభ్యుల ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసింది. బిజెపికి చెందిన 12 మంది శాసనసభ్యులు మద్దతు ఉపసంహరించుకోవడంతో మాయావతి నేతృత్వంలోని బిఎస్‌పి- బిజెపి సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడిందని వారు గవర్నర్‌కు చెప్పారు. మాయావతి సర్కార్‌ను డిస్మిస్‌ చేయాలని వారు కోరారు.

తమకు మద్దతు ఇస్తున్న 204 మంది శాసనసభ్యుల పేర్లతో కూడిన జాబితాను ఈ ప్రతినిధి బృందం గవర్నర్‌కు సమర్పించింది. ఈ జాబితాలో కాంగ్రెస్‌ శాసనసభ్యుల పేర్లు గానీ, 37 మంది బిజెపి తిరుగుబాటు శాసనసభ్యుల పేర్లు గానీ లేవు.

తాము మాయావతి సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు గానీ, ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని గానీ తనను కలిసిన బిజెపి శాసనసభ్యులు చెప్పలేదని గవర్నర్‌ తమతో అన్నట్లు అమర్‌ సింగ్‌ విలేకరులతో చెప్పారు. మాయావతి ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయామని మాత్రమే వారు చెప్పినట్లు గవర్నర్‌ తెలిపారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X