వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
డిసెంబర్ 25 నుంచిఅరకు ఫెస్టివల్
విశాఖపట్నం: ఏటా నిర్వహించే అరకు ఫెస్టివల్ ను ఈ సారి డిసెంబర్ 25 నుంచి నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన అరకు ప్రాంతంలో అత్యధికంగా గిరిజనులు నివసిస్తారు. ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు కలిగిన ఈ గిరిజనుల సంస్కృతిని అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో అరకు ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. అలాగే తరిగిపోతున్న అటవిసంపద గురించి ప్రజల్లో చైతన్యం తీసుకునేందుకు ఈ ఫెస్టివల్ ఉపయోగపడుతుందని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.
అటవీశాఖ, పర్యాటక శాఖ సంయుక్తంగా నిర్వహించే ఈ ఫెస్టివల్ కు పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించేందుకు హైదరాబాద్ నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు.
Comments
Story first published: Saturday, November 2, 2002, 23:53 [IST]