సచిన్ సెంచరీ, గట్టెక్కిన భారత్
కోల్ కతా: స్టార్ బ్యాట్స్ మెన్ సచిన్ టెండూల్కర్ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో భారత్ గట్టెక్కింది. వెస్టిండీస్ తో ఇక్కడ జరుగుతోన్న మూడో టెస్ట్ మ్యాచ్ లో విండీస్ బౌలర్లు మరోమారు విజృంభించి భారత్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. అయితే, టెండూల్కర్ ధాటిగా ఆడి వికెట్ల పతనాన్ని అడ్డుకోవడమే కాకుండా స్కోర్ ను సైతం భారీగా పెంచాడు.
టెస్ట్ ల్లో 31వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆట నాలుగో రోజైన శనివారం నాడు వెస్టిండీస్ జట్టును 497 పరుగులకు భారత్ ఆలౌట్ చేసింది. హర్భజన్ సింగ్ ఐదు వికెట్లు కూల్చి వెస్టిండీస్ ను కుప్పకూల్చాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ త్వరగా వికెట్లను కోల్పోయింది.
వర్షం వల్ల మ్యాచ్ అర్ధాంతరంగా ముగియడానికి ముందు సచిన్ 114 పరుగులతోనూ, లక్ష్మణ్ 36 పరుగులతోను కొనసాగుతున్నారు. విండీస్ పై భారత్ కేవలం 56 పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే కలిగి ఉంది. ఆట చివరి రోజైన ఆదివారం నాడు భారత్ ను త్వరగా ఔట్ చేయగలిగితే విండీస్ కు విజయావకాశాలు మెరుగవుతాయి.