వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్‌ సెంచరీ, గట్టెక్కిన భారత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌ కతా: స్టార్‌ బ్యాట్స్‌ మెన్‌ సచిన్‌ టెండూల్కర్‌ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో భారత్‌ గట్టెక్కింది. వెస్టిండీస్‌ తో ఇక్కడ జరుగుతోన్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌ లో విండీస్‌ బౌలర్లు మరోమారు విజృంభించి భారత్‌ టాప్‌ ఆర్డర్‌ ను కుప్పకూల్చారు. అయితే, టెండూల్కర్‌ ధాటిగా ఆడి వికెట్ల పతనాన్ని అడ్డుకోవడమే కాకుండా స్కోర్‌ ను సైతం భారీగా పెంచాడు.

టెస్ట్‌ ల్లో 31వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆట నాలుగో రోజైన శనివారం నాడు వెస్టిండీస్‌ జట్టును 497 పరుగులకు భారత్‌ ఆలౌట్‌ చేసింది. హర్భజన్‌ సింగ్‌ ఐదు వికెట్లు కూల్చి వెస్టిండీస్‌ ను కుప్పకూల్చాడు. అనంతరం బ్యాటింగ్‌ కు దిగిన భారత్‌ త్వరగా వికెట్లను కోల్పోయింది.

11 పరుగులకే విండీస్‌ బౌలర్లు ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్‌ కు పంపించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌ కు దిగిన రాహూల్‌ ద్రావిడ్‌, కెప్టెన్‌ గంగూలీలు కూడా పెద్దగా స్కోర్‌ చేయకుండానే ఔటయ్యారు. చిచ్చరపిడుగు టెండూల్కర్‌ బాధ్యతాయుతంగా ఆడి వికెట్ల పతానాన్ని నిలువరించాడు. టెండూల్కర్‌ కు హైదరాబాదీ బ్యాట్సెమెన్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌ జతవ్వడంతో స్కోర్‌ నెమ్మదిగా పెరిగింది.

వర్షం వల్ల మ్యాచ్‌ అర్ధాంతరంగా ముగియడానికి ముందు సచిన్‌ 114 పరుగులతోనూ, లక్ష్మణ్‌ 36 పరుగులతోను కొనసాగుతున్నారు. విండీస్‌ పై భారత్‌ కేవలం 56 పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే కలిగి ఉంది. ఆట చివరి రోజైన ఆదివారం నాడు భారత్‌ ను త్వరగా ఔట్‌ చేయగలిగితే విండీస్‌ కు విజయావకాశాలు మెరుగవుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X