వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు పని చేసిన దత్తాత్రేయ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బిజెపికి చెందిన కేంద్రమంత్రులు పని కూడా చేస్తారని బండారు దత్తాత్రేయ శనివారం నిరూపించారు. సాధారణంగా సమావేశాల ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం, రిబ్బన్‌ కటింగ్‌ సమావేశాలకు హాజరయ్యే దత్తాత్రేయ ఆయన తను మంత్రినన్న విషయాన్ని రుజువుచేసుకున్నారు. ఉన్నట్టుండి ఆయన రైల్వే శాఖ సహాయ మంత్రి అన్న విషయం గుర్తుకొచ్చి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్‌ నుంచి ఖమ్మం రూట్‌ లో ఆయన ప్రయాణించి ఒక్కో స్టేషన్‌ లలో ఆగుతూ..రైల్వే అధికారుల పనితీరును సమీక్షించారు. కాజీపేట తదితర రైల్వే స్టేషన్లలో సౌకర్యాలను పరిశీలించారు. క్యాంటిన్‌, టాయెలెట్లలో పరిశుభ్రతను చెక్‌ చేశారు.

సాధారణంగా రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర రావు, కృష్ణంరాజులు పార్లమెంట్‌ సమావేశాల సమయంలో మినహా ఎక్కువగా రాష్ట్రంలోనే ఉంటారు. వీరు ముగ్గురు నిర్వహించే మంత్రిత్వ శాఖల పనిమీద తరుచుగా రాష్ట్రానికి వస్తుంటారు. అయితే, తమ శాఖల గురించి కాకుండా ఇతర కలాపాల్లోనే ఎక్కువగా తలమునకలవుతుంటారు. శుక్రవారం కృష్ణా జలాల ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దత్తాత్రేయ వెంటనే తనిఖీలను కూడా నిర్వహించడం విశేషం.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X