వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎట్టకేలకు పని చేసిన దత్తాత్రేయ
హైదరాబాద్: బిజెపికి చెందిన కేంద్రమంత్రులు పని కూడా చేస్తారని బండారు దత్తాత్రేయ శనివారం నిరూపించారు. సాధారణంగా సమావేశాల ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం, రిబ్బన్ కటింగ్ సమావేశాలకు హాజరయ్యే దత్తాత్రేయ ఆయన తను మంత్రినన్న విషయాన్ని రుజువుచేసుకున్నారు. ఉన్నట్టుండి ఆయన రైల్వే శాఖ సహాయ మంత్రి అన్న విషయం గుర్తుకొచ్చి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్ నుంచి ఖమ్మం రూట్ లో ఆయన ప్రయాణించి ఒక్కో స్టేషన్ లలో ఆగుతూ..రైల్వే అధికారుల పనితీరును సమీక్షించారు. కాజీపేట తదితర రైల్వే స్టేషన్లలో సౌకర్యాలను పరిశీలించారు. క్యాంటిన్, టాయెలెట్లలో పరిశుభ్రతను చెక్ చేశారు.
Comments
Story first published: Saturday, November 2, 2002, 23:53 [IST]