వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాయావతి వేధింపులు : రాజాభయ్యా

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసమ్మతి శాసనసభ్యులను ముఖ్యమంత్రి మాయావతి హింసిస్తున్నారని ఇండిపెండెంట్‌ శాసనసభ్యుల నేత రఘురాజ్‌ ప్రతాప్‌ సింగ్‌ అలియాస్‌ రాజా భయ్యా విమర్శించారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) శాసనసభ్యుడు పూరన్‌ సింగ్‌ బుందేలాను బెదిరించారనే ఆరోపణపైన రాజా భయ్యాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను అడ్డుకోవడానికి మాయావతి ఈ చర్యలకు పాల్పడుతున్నారని రాజా భయ్యా అన్నారు.

ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి పాలక బిఎస్‌పి- బిజెపి సంకీర్ణం అసమ్మతి శాసనసభ్యులను వేధిస్తున్నదని ఆయన ఆదివారం విలేకరులతో అన్నారు. ఈ విధమైన చర్యలతో ప్రభుత్వ మనుగడ సాధ్యం కాదనేది మాయావతి గుర్తించాలని ఆయన అన్నారు. బుందేలా కొద్ది రోజుల క్రితం సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్‌సింగ్‌ పట్ల విధేయత ప్రకటించినట్లు ఆయన తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X