వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణాజలాలపై కొత్త ట్రిబ్యునల్‌ కు వినతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కృష్ణజలాలపై కొత్తగా ట్రిబ్యునల్‌ ను ఏర్పాటు చేయవల్సిందిగా కేంద్రాన్ని కోరాలని అఖిలపక్షం నిర్ణయించింది. కృష్ణాజలాల పునఃపంపిణీపై కొత్త ట్రిబ్యునల్‌ ను కోరుతూ ఇప్పటికే మహారాష్ట్ర, కర్నాటకలు కోరినందున తామ వాదనను గట్టిగా వినిపించాలని అఖిలపక్షం నిర్ణయించింది. ఈ నెల 15లోపు తమ వినతిని కేంద్రానికి సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణాజలాల ట్రిబ్యునల్‌ పై రాష్ట్రప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ప్రభుత్వానికి విపక్షాలు స్థూలంగా మద్దతిచ్చినప్పటికీ సమావేశం గతంలో మాదిరిగానే రసాభసాగా ముగిసింది. ట్రిబ్యునల్‌ ఏర్పాటు గురించి ప్రభుత్వ వాదన తెలంగాణాకు ఏ మాత్రం న్యాయం చేకూర్చదని వాదిస్తూ తెలంగాణా రాష్ట్ర సమితి(టీఆర్‌ ఎస్‌) సమావేశం నుంచి వాకౌట్‌ చేసింది.

కృష్ణా నది క్యాచ్‌ మెంట్‌ ఏరియా తెలంగాణా కింద 68 శాతం ఉంది. కానీ ఈ ఏరియాకు అందుతోన్న నీరు మాత్రం స్వల్పం అంటూ టీఆర్‌ ఎస్‌ వాదించింది. ప్రభుత్వం మాత్రం అంతర్గత పంపిణీ గురించి తర్వాత ఆలోచించవచ్చని చెప్పడంతో ఆ పార్టీ నేతలు వాకౌట్‌ చేశారు.

ముందు కలిసికట్టుగా ట్రిబ్యునల్‌ ముందు మన వాదన వినపించాలి. మిగులు జలాలపై మనం హక్కు సంపాదించాలి. హక్కు సంపాదించాక, అంతర్గత విషయాలపై దృష్టి సారించొచ్చని భారీ నీటిపారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి విపక్షాలకు వివరించాడు. మరోవైపు, కాంగ్రెస్‌ కడియం సారధ్యంలో ఒరిగేదేమీ ఉండదంటూ సమావేశాన్ని బాయ్‌ కాట్‌ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X