వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూలో నలుగురి హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని దోడా, పూంఛ్‌, ఉద్ధంపూర్‌ జిల్లాల్లో జరిగిన వేర్వేరు హింసాత్మక ఘటనల్లో ఒక మహిళతో పాటు నలుగురు మరణించారు; ఒకరు గాయపడ్డారు.

పూంఛ్‌ జిల్లాలోని సురాన్‌కోట్‌ తహిసిల్‌లో గల హరి- మర్హోత్‌లో భద్రతాబలగాలకు, మిలిటెంట్లకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మహిళ మరణించగా, ఆమె సోదరుడు గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

ఉధంపూర్‌ జిల్లాలోని గూల్‌ తెహిసీల్‌లోని అటవీ ప్రాంతంలో ఫెతెహ్‌ మొహ్మద్‌ అనే వ్యక్తి శవాన్ని పోలీసులు కనుక్కున్నారు. అతని గొంతు కోసి వుండడం వారు గమనించారు. హత్యకు గురైన వ్యక్తిని దాల్వా గ్రామంలోని అతని ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. తీవ్రవాదులు దోడా జిల్లాలో ఇద్దరు వ్యక్తులను హత్య చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X