వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చూలాలిపై కానిస్టేబుల్ ఘాతుకం?
హైదరాబాద్: పండుగ మామూళ్ళ కోసం ఓ కానిస్టేబుల్ నిండు చూలాలిపై దౌర్జాన్యానికి దిగాడు. రంగారెడ్డి జిల్లా దుండిగల్ లోని రోడ్డు మీద కిరాణ దుకాణం నిర్వహిస్తోన్న ఓ కుటుంబాన్ని కిష్టప్ప అనే పోలీసు కానిస్టేబులు కొద్ది ోజుల క్రితం చితకబాదినట్లు తెలుస్తోంది. పండుగ మామూళ్ళ అడిగితే, లేదనడంతో కిష్టప్ప ఆ దుకాణపు యజయాని తీవ్రంగా కొట్టాడు. భర్తను కొట్టవద్దని ఆయన భార్య కిష్టప్పను వేడుకొంది.
ఆమె నిండు చూలాలని కూడా చూడకుండా అతను తన కాలిబూటుతో ఆమె కడుపుపై తన్నాడు. రెండు రోజుల అనంతరం ఆమె చనిపోయిన కొడుకును కనింది. కిష్టప్ప దౌర్జన్యం వల్లే తన కొడుకు చనిపోయాడని భార్యభర్తలు పోలీసుస్టేషన్ లో కేసు వేశారు.
Story first published: Tuesday, November 5, 2002, 23:53 [IST]