వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చూలాలిపై కానిస్టేబుల్‌ ఘాతుకం?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పండుగ మామూళ్ళ కోసం ఓ కానిస్టేబుల్‌ నిండు చూలాలిపై దౌర్జాన్యానికి దిగాడు. రంగారెడ్డి జిల్లా దుండిగల్‌ లోని రోడ్డు మీద కిరాణ దుకాణం నిర్వహిస్తోన్న ఓ కుటుంబాన్ని కిష్టప్ప అనే పోలీసు కానిస్టేబులు కొద్ది ోజుల క్రితం చితకబాదినట్లు తెలుస్తోంది. పండుగ మామూళ్ళ అడిగితే, లేదనడంతో కిష్టప్ప ఆ దుకాణపు యజయాని తీవ్రంగా కొట్టాడు. భర్తను కొట్టవద్దని ఆయన భార్య కిష్టప్పను వేడుకొంది.

ఆమె నిండు చూలాలని కూడా చూడకుండా అతను తన కాలిబూటుతో ఆమె కడుపుపై తన్నాడు. రెండు రోజుల అనంతరం ఆమె చనిపోయిన కొడుకును కనింది. కిష్టప్ప దౌర్జన్యం వల్లే తన కొడుకు చనిపోయాడని భార్యభర్తలు పోలీసుస్టేషన్‌ లో కేసు వేశారు.

అయితే, కేసును పరిశీలించక ముందే దుండిగల్‌ ఎస్‌.ఐ చంద్రబోస్‌ కానిస్టేబులును సమర్ధించడంతో మరింత వివాదంగా మారింది. దర్యాప్తును సాగిస్తున్నాం. కేసును ఉన్నతాధికారులకు నివేదిస్తాను. తప్పు ఉంటే కిష్టప్పను అరెస్ట్‌ చేస్తామని చంద్రబోస్‌ విలేకరులకు చెప్పాడు. అంతకుముందు, కిష్టప్పను ఎందుకు సమర్ధించారు అని అడిగితే ఆయన మాట దాటవేశాడు. కిష్టప్పను వెంటనే సస్పెండ్‌ చేయాలని మానవహక్కుల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X