వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బీహార్లో రైళ్లు ఢీ- ఒకరు మృతి
అంబాలా: భారతీయ వైమానిక దళానికి చెందిన యుద్దవిమానం ఒకటి హర్యానాలోని అంబాలా నివాసప్రాంతంలో మంగళవారం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించారు. అంబాల కంటోన్మెంట్ నుంచి బయలుదేరిన ఈ యుద్ద విమానం మూడు కిలోమీటర్లు ప్రయాణించక ముందే ఆనంద్ విహార్ లోని కాలనీలో కుప్పకూలింది.
సాయంత్రం నాలుగు గంటలకు గాలిలోకి లేవగానే విమానంలో మంటలు చెలరేగాయాని వారు చెప్పారు. దీంతో పైలెట్ చేతిలో విమానం అదుపుతప్పి నివాస ప్రాంతాలపై కుప్పకూలింది. విమాన శకలాలు వంద మీటర్ల దూరం వరకు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
Comments
Story first published: Tuesday, November 5, 2002, 23:53 [IST]