వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక తెలంగాణాలో ఎత్తిపోతలే!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన బుధవారం ప్రసంగించారు.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి రాజకీయాలు చేస్తున్నారని, కాంగ్రెస్‌ పాలనలో ఆ ప్రాంతాలను పట్టించుకోలేదని, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని ఆయన అన్నారు.

మే నెలలో రాష్ట్రస్థాయి సదస్సు జరిగే వరకు భారీగా సభ్యత్వాలను చేర్పించాలని ఆయన పార్టీ నాయకులను కోరారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలో పార్టీ మహానాడు నిర్వహించనున్నట్లు ఆయన సూచనప్రాయంగా తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X