వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
13 నుంచి అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: ఈ నెల 13 నుంచి రాష్ట్రఅసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో సభ ముందు ఉంచాల్సిన బిల్లుల గురించి రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం సాయంత్రం మూడు గంటల పాటు చర్చించింది.
ఈ సమావేశాల్లో కరువు, విద్యుత్ పైవిపక్షాలు పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశమున్నందున, వాటిపై మంత్రివర్గం కసరత్తు చేసింది. రాష్ట్రంలో కరువుపై మరోసారి సమగ్రంగా చర్చించింది. నీరు-మీరు, మధ్యాహ్న భోజన పథకంపై కూడా సమావేశంలో చర్చించారు. జాతీయ క్రీడల నిర్వహణ ఏర్పాట్ల పనులను ముఖ్యమంత్రి సమీక్షించారు. కొత్త దేవాదయ చట్టం గురించి మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది.
Comments
Story first published: Thursday, November 7, 2002, 23:53 [IST]