వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బూచి

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: పేలుడు పదార్థం ఉంచినట్లు ఫోన్‌ రావడంతో చెన్నై విమానాశ్రయంలో గందరగోళం చెలరేగింది. విమానాశ్రయం అధికారులు, భద్రతా సిబ్బంది గంట పాటు శోధించారు. చివరికి అది అబద్ధమని తేలడంతో ఊపరి పీల్చుకున్నారు.

రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ రాక సందర్భంగా ఈ ఫోన్‌కాల్‌ రావడంతో అధికార వర్గాలు అణువణువూ గాలించాయి. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ కోసం వాడే ఇంటర్‌కమ్‌లో సమాచారం అందిందని విమానాశ్రయాధికారులు చెప్పారు. వెంటనే బాంబు విస్ఫోటక దళాలు, శునకాలు రంగంలోకి దిగాయి. తమకు అందిన సమాచారం అబద్ధమని తేలిపోయింది. ఈ సంఘటన ఫెర్నాండెజ్‌ రాకకు ఒక గంట ముందు జరిగింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X