గేట్స్ కు బాబురాచమర్యాదలు!
హైదరాబాద్: మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ రాక కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పట్నుంచే ఎదురుచేస్తున్నారు. బిల్ గేట్స్ కు ఒక దేశాధినేత కన్నా ఎక్కువ మర్యాదలు చేయాలని బాబు ఉన్నతాధికారులకు సూచించారు. అన్ని ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుస్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బిల్ గేట్స్ భారత్ కువిచ్చేస్తున్నారు. అందులో ఒక రోజు పూర్తిగా హైదరాబాద్ లోనే గడుపుతారు. నవంబర్ 13వ తేదీ రాత్రి 11 గంటలకు హైదరాబాద్ కు వస్తారు. మర్నాడు రాత్రి పదిగంటల వరకు ఆయన హైదరాబాద్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ షెడ్యూల్ ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ, ముఖ్యమంత్రిస్వయంగా గురువారం నాస్కామ్ సభ్యులకు ఉత్సాహంగా తెలియచేశారు. పిల్లల కోసం రూపొందించిన హెపటైటిస్-బి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఆయన హైదరాబాద్ లో ప్రారంభిస్తారు.
దీంతో పాటు, సత్యం డెవలప్ మెంట్ సెంటర్ ను కూడా సందర్శిస్తారు. అయితే, ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఆ రోజంతా ముఖ్యమంత్రి ఆయనతోనే ఉంటారని ఉన్నతాధికారులు చెప్పారు. ఏ దేశాధినేతకు లభించని మర్యాదలు ఆయనకు లభిస్తాయి. అలా మాకు ఆదేశాలు కూడాఅందాయని ఓ అధికారి చెప్పారు.