వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌ లో మళ్ళీ చెలరేగిన అల్లర్లు

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతోండగా మళ్ళీ అక్కడ మతకలహాలు చెలరేగాయి. గత కొద్ది వారాలుగా ప్రశాంతంగా ఉన్న అత్యంత సమస్యాత్మక ప్రాంత జమాల్‌ పూర్‌ లో గురువారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఏడుగురు గాయపడ్డారు.వీరిలో ఒక మహిళ కూడా ఉంది. దీపావళి పండుగ సందర్భంగా స్థానిక హవేలికి ఒక వర్గం వారు వచ్చి బాణాసంచా కాల్చడం మొదలుపెట్టడంతో గొడవ ప్రారంభమైంది.

మరో వర్గం వారు దీన్ని అడ్డుకోవడంతో ఘర్షణపెరిగి ఒకర్నొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న షాప్‌ లను తగులబెట్టారు. అనేక ఇళ్ళు కూడా ధ్వంసమయ్యాయి. ఇరువర్గాలను శాంతింపచేసేందుకు పోలీసులువిశ్వప్రయత్నం చేశారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని పోలీసులు చెప్పుతున్నారు. అయితే, ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని స్థానిక టెలివిజన్‌ వార్తాకథానాలను బట్టి తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X