కరువుకు కార్యాచరణ: బాబు ఆదేశం
హైదరాబాద్:
రాష్ట్రంలో
కరువును
ఎదుర్కునేందుకు
కార్యాచరణ
ప్రణాళికను
తయారు
చేయాలని
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
జిల్లా
కలెక్టర్లను
ఆదేశించారు.అర్థ
సంవత్సరం
పనితీరును
అంచనా
వేయడానికి
ప్రణాళికా
సంఘం
ఏర్పాటు
చేసిన
జిల్లా
కలెక్టర్ల
సమావేశాన్ని
ఆయన
శుక్రవారం
ప్రారంభించారు.
ప్రజల, రైతుల ఇబ్బందులను తొలగించడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ దృష్ట్యా ప్రత్యమ్నాయ ఉత్పత్తి మార్గాలను అన్వేషించాలని ఆయన అన్నారు. ప్రస్తుత స్థితిలో జిల్లా యంత్రాంగాలు మరింత కష్టపడి చేయాలని ఆయనకోరారు. కరువు పీడిత ప్రాంతాల్లో మంచినీటి సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు.
రాష్ట్రం
తుఫాను,
వరదల
వంటి
పలు
ఇబ్బందులను
ఎదుర్కొన్నదని,
ఈ
సమయాల్లో
ప్రజలను
ప్రభుత్వం
ఆదుకున్నదని
ఆయన
చెప్పారు.ప్రజల
ఆకాంక్షలు,
ఆశలు
పెరుగుతున్నాయని,
వారి
ఆకాంక్షలకు
అనుగుణంగా
పని
చేయడం
నేటి
అవసరమని
ఆయన
చెప్పారు.
పాలనా
సంస్కరణలు
అన్ని
స్థాయిల్లో
అమలు
చేసి
పారదర్శకతను
పాటించాలని
ఆయన
సూచించారు.