వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌లో 42 మందిఅరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని గోమతిపూరా ప్రాంతంలో గురువారం జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు 42 మందినిఅరెస్టు చేశారు. గురువారం గోమతిపురా, దనిలిమిందా, షాపూర్‌ ప్రాంతాల్లో ఇరు వర్గాలు ఘర్షణకు దిగి అల్లర్లకు పాల్పడడంతో తొమ్మిది మంది గాయపడ్డారు.

ఈ నెల 5వ తేదీన తలెత్తినస్వల్ప తగాదాకు సంబంధించి ప్రతీకారాలు తీర్చుకోవడానికి గురువారం నాడు గోమతిపురాలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా పరిస్థితి అదుపు చేయడానికి పోలీసులు 101 టియర్‌ గ్యాస్‌షెల్స్‌ ప్రయోగించారు. 19 రౌండ్లు కాల్పులు జరిపారు.

నగరంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు, నిఘాను పటిష్టపరిచినట్లు అదనపు పోలీసు కమిషనర్‌ సతీ్‌్‌ వర్మ చెప్పారు. గత రెండు రోజులుగా జమాల్పూర్‌, గోమతిపురా ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లలో 16 మంది గాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X