వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజలను దగా చేసిన ఎన్‌డిఎ: సోనియా

By Staff
|
Google Oneindia TeluguNews

మౌంట్‌ అబూ: దేశ సత్వరాభివృద్ధికి బలమైన కేంద్రం, రాష్ట్రాలు, పంచాయతీరాజ్‌ వ్యవస్థ అవసరమని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. పార్టీ ముఖ్యమంత్రుల రెండు రోజుల సమావేశాన్ని ఆమె శుక్రవారం ఇక్కడ ప్రారంభించారు.

ప్రజాసమస్యలను పరిష్కరించడంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వం పూర్తిగావిఫలమైందని, స్తబ్ధత నుంచి ప్రగతిలోకి, చీకటి నుంచి వెలుగులోకి రావడానికి ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని ఆమె అన్నారు. కాంగ్రెసేతర రాజకీయ పార్టీల ప్రభుత్వాలకు భిన్నమైన పాలననుఅందించే కాంగ్రెస్‌ వైపు దాని సిద్ధాంతాల వల్ల, కఠినశ్రమ వల్ల, నిబద్ధత వల్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

సామాన్య ప్రజల సంక్షేమానికి ఎన్నికల ప్రణాళికల చేర్చిన కార్యక్రమాల అమలు చేయడంలో ఎదురువుతున్న వైఫల్యాలను సమీక్షించుకోవాలని, తమ పాలనవిషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని సోనియా పార్టీ ముఖ్యమంత్రులకు సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X