వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ పై విండీస్‌ ఘనవిజయం

By Staff
|
Google Oneindia TeluguNews

నాగ్‌ పూర్‌: మరోసారి భారత బౌలర్లు విఫలమవడంతోవరుసగా రెండో వన్డేలోనూ భారత్‌ పరాజయాన్నిచవిచూసింది. టెస్ట్‌ సిరీస్‌ లో దారుణంగా వైఫల్యంచెందినప్పటికీ విండీస్‌ ఆటగాళ్ళు వన్డేల్లో తమ ప్రతాపాన్నిచూపిస్తున్నారు. శనివారం నాగ్‌ పూర్‌ లో జరిగన రెండోవన్డేలో భారత్‌ పై విండీస్‌ ఏడు వికెట్ల తేడాతోఘనవిజయం సాధించింది.

280 పరుగుల లక్ష్యాన్ని విండీస్‌ ఆటగాళ్ళుసునాయసంగా ఛేదించారు. క్రిస్‌ గేయిల్‌ భారత్‌ బౌలర్లను చీల్చి చెండాడు.క్రిస్‌ ధాటిగా ఆడుతూ భారత్‌ ను ముప్పుతిప్పలు పెట్టాడు. 116 బంతుల్లో 103పరుగులతో క్రిస్‌ వేసిన పునాదిని శామ్యూల్స్‌,శివనరాయణ్‌ చందర్‌ పాల్‌ లు మరింత బలపరిచివిండీస్‌ కు విజయం చేకూర్చారు. ఉదయం టాస్‌ గెలిచినవిండీస్‌ భారత్‌ ను బ్యాటింగ్‌ కు దింపింది.మంచు దట్టంగా అలుముకోవం వల్ల మ్యాచ్‌ ఆలస్యంగాప్రారంభమైంది. దీంతో 47 ఓవర్లకు కుదించారు.గంగూలీ, సెవాహగ్‌ తో కలిసి బ్యాటింగ్‌ ను ప్రారంభించాడు.

సెవహాగ్‌ కేవలం ఒకటే పరుగు సాధించిడ్రేక్స్‌ బౌలింగ్‌ లో అవుటయ్యాడు. ఆ తర్వాత వన్‌ డౌన్‌లో వచ్చిన అగార్కర్‌ కూడా నిరాశపర్చాడు. అతనూవెంటనే అవుటయ్యాడు. హైదరాబాద్‌బ్యాట్స్‌ మెన్‌ వి.వి.ఎస్‌.లక్ష్మణ్‌, గంగూలీలిద్దరూ ధాటిగా ఆడుతూ స్కోర్‌ను పరుగులెత్తించారు. గంగూలీ 78 పరుగుల వద్దఅవుటయ్యాడు. అనంతరం ద్రవిడ్‌ తో కలిసి లక్ష్మణ్‌ స్కోర్‌వేగాన్ని పెంచాడు. 99 పరుగుల వద్ద లక్ష్మణ్‌దురదృష్టవశాత్తూ రనౌటి, సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. 47ఓవర్లలో భారత్‌ 279 పరుగులు చేసింది. మ్యాన్‌ఆఫ్‌ ది మ్యాచ్‌ క్రిస్‌ గెయిల్‌ ను వరించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X