వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలివ్‌ గ్రీన్స్‌ సభ్యుల్లోఇద్దరి హతం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: దోపిడిదొంగలముఠా ఆలివ్‌ గ్రీన్స్‌ సభ్యులైన సమ్మయ్య,చంటిలను శుక్రవారం పోలీసులు ఎన్‌ కౌంటర్‌లో హతమార్చారు. కరుడుగట్టినదోపిడిదొంగలైన వీరిద్దరిని సొత్తు రికవరీ కోసంమహబూబ్‌ నగర్‌ జిల్లా షాద్‌ నగర్‌ తీసుకెళ్ళివస్తుండగా ఈ ఎన్‌ కౌంటర్‌ జరిగిందని పోలీసులు తెలిపారు.

శుక్రవారం రాత్రి షాద్‌ నగర్‌ నుంచి తిరిగివస్తుండగా సమ్మయ్య ఎస్‌.ఐ పిస్టోల్‌ లాక్కొని కాల్పులు ప్రారంభించాడు.దాంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈఘటనలో సమ్మయ్య, చంటిలు చనిపోగా, సి.ఐకిగాయాలయ్యాయి. అతను ఇప్పుడు అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడని రంగారెడ్డి జిల్లా ఎస్పీరామచంద్రరాజు శనివారం విలేకరులకు తెలిపారు.ఆయన చెప్పిన వివరాల ప్రకారం....

పలు దోపిడిలకు, నేరాలకు పాల్పడ్డఆలీవ్‌ గ్రీన్‌ ముఠాలోని తొమ్మిది మందిని గతనెలలో పోలీసులుఅరెస్ట్‌ చేశారు. ఈ ముఠా నాయకుడు జిన్నాను గతనెలలో కడపలో పోలీసులు ఎన్‌ కౌంటర్‌ లోకాల్చిచంపారు. జైలులో శిక్షను అనుభవిస్తోన్న ఈతొమ్మిదిమందిలో నలుగురిని తీసుకొని సొత్తు రికవరీచేసేందుకు కోర్టు అనుమతినిచ్చింది.

అందులో భాగంగా సమ్మయ్య, చంటిలను బెంగుళూర్‌రోడ్డులోని పాద్మకులకు తీసుకెళ్ళారు. అక్కడినుంచి తిరిగి వస్తుండగా సమ్మయ్య తిరగబడిపోలీసులపై కాల్పులు ప్రారంభించాడు. పోలీసులూవెంటనే రియాక్ట్‌ ఇద్దరిని మట్టుబెట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X